వైఎస్సార్ రైతు భరోసా కింద 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయాన్ని ఎపి సర్కార్ విడుదల చేసింది. గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం కంప్యూటర్లో బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేశామని జగన్ అన్నారు.