ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు.. పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్నారులకు మంచి వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ‘అంగన్ వాడీల్లో నాడు-నేడు కార్యక్రమానికి ప్రభుత్వం దాదాపు రూ.1500 కోట్లకు పైగా ఖర్చుచేస్తోంది. మూడు విడతల్లో పనులు చేపట్టాలి. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలి అని ఆయన పేర్కొన్నారు.