ప్రభుత్వం ఇస్తున్న విద్యాదీవెన పథకాన్ని చూడలేకే టిడిపి నాయకులు ప్రశ్నాప్రతాలను లీక్ చేస్తున్నారని సిఎం జగన్ ఆరోపించారు. టిడిపి హయాంలో మంత్రులుగా పనిచేసిన వారి స్కూళ్ళ నుంచే ఈ పత్రాలు లీక్ అవుతున్నాయని ఆయన చెప్పారు. ‘రెండు నారాయణ స్కూళ్ళు, మూడు చైతన్య స్కూళ్ళ నుంచి పేపర్ లీక్ అయ్యాయి. ఈ స్కూళ్ళన్నీ ఎవరివి? ఎవరండీ ఈ నారాయణ? చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా చేసిన వ్యక్తే కదా?’ అని జగన్ ప్రశ్నించారు.