ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుకు కర్నూలులో ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఓర్వకల్లు మండలం గుమ్మితం తండా, పాణ్యం మండలం పిన్నాపురంలలో గ్రీన్ కో ఎనర్జీస్ లిమిటెడ్ ఈ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతోంది. వచ్చే 5 ఏళ్ళలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 23 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఏడాదికి 5,410 మె.వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగనుంది.
ప్రపంచంలోనే తొలి హైడల్ పవర్ ప్రాజెక్టుకు సీఎం శ్రీ వైయస్ జగన్ శంకుస్థాపన. #LargestPowerProjectInAP#GreenkoIRESP pic.twitter.com/gDA9P0dJGT
— YSR Congress Party (@YSRCParty) May 17, 2022