కొత్త ఏడాది సందర్బంగా రైతుల రుణమాఫీ విషయంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. చిన్న కమతాలు, బ్యాంకు రుణాలు మరియు రైతు బీమా ఇతర అవసరాల కోసం కుటుంబంలో ఇద్దరు నుంచి ముగ్గురు చొప్పున పంపకాలు చేసుకున్న భూములను దృష్టిలో పెట్టుకొని..75 వేల నుంచి లక్ష వరకు బకాయిలు ఉన్న రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన అతి త్వరలో తెలుపనున్నట్లు చెపుతున్నారు.