తెలంగాణ సిఎం కెసిఆర్ ఈరోజు బెంగళూరు వెళ్ళనున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు ఆ రాష్ట్ర మాజీ సిఎం కుమారస్వామిని కూడా కలిసి దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ నేతలందరూ కలిసి రేపు మధ్యాహ్నం లంచ్ సమయంలో కలవనున్నట్లు సమాచారం. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలు అనుసరించాల్సిన కార్యాచరణ, పార్టీల పాత్ర తదితర అంశాలపై కేసీఆర్ వారితో చర్చలు జరపనున్నారు.