మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ అయ్యారు. బెంగళూరులోని దేవెగౌడ నివాసంలో గురువారం ఈ భేటీ జరిగింది. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్ అనంతరం దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చలు జరిపారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా దేవె గౌడ ఇంటి పరిసరాల్లో కేసీఆర్ కటౌట్లు కనిపించాయి. హైదరాబాద్కు వస్తున్న ప్రధానిని కలవకూడదనే కేసీఆర్ బెంగళూరు వెళ్ళారని తెలంగాణ బిజెపి శ్రేణులు విమర్శించాయి.
సీఎం కేసీఆర్ గారు బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై వారితో చర్చించారు. pic.twitter.com/zXgxUz5iUK
— TRS Party (@trspartyonline) May 26, 2022