60 కి చేరిన బీహార్​ కల్తీసారా మృతులు.. ఒక్కరోజు పేపర్లో ఉంటుందన్న సిఎం

By udayam on December 16th / 10:37 am IST

బీహార్​ లో కల్తీసారా తాగి మరణిస్తున్న వారి సంఖ్య గంట గంటకూ పెరుగుతోంది. ఈరోజు మరో 28 మంది సారన్​ జిల్లాలో మృత్యువాత పడ్డారు. అయితే ఈ మృతులకు ఎలాంటి నష్ట పరిహాం అందించమని సిఎం నితీష్​ కుమార్​ మరోసారి చెప్పారు. మధ్​యప్రదేశ్​, ఉత్తరప్రదేశ్​ లతో పోల్చితే బీహార్​ లో కల్తీ సారాతో మరణిస్తున్న వారి సంఖ్య తక్కువేనని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు ఈ ఘటనను గుజరాత్​ లోని మోర్బీ వంతెన కూలడంతో పోల్చిన ఆయన ‘మోర్బీనే పేపర్లు ఒక్కరోజు వార్తను చేశాయి. ఈ వార్తెంత?’ అంటూవ్యాఖ్యానించారు.

ట్యాగ్స్​