చలి గుప్పిట ఢిల్లీ, రాజస్థాన్​, హర్యానా, పంజాబ్​

By udayam on December 26th / 10:03 am IST

ఉత్తర భారతదేశం తీవ్ర చలి గుప్పిట చిక్కుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు రాజస్థాన్​, హర్యానా, పంజాబ్​, ఛండీఘర్​, హిమాచల్​ ప్రదేశ్​ లలో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు పడిపోయాయి. మరో నలుగు రోజుల పాటు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని వాతావరణ శాఖ పేర్కొంది. పొగ మంచు కమ్మేయడంతో హిమాచల్​, ఢిల్లీ, బీహార్​, బెంగాల్​, సిక్కిం, ఒడిశా, అస్సాం, త్రిపురల్లోనూ ఉష్ణోగ్రతలు తీవ్రంగా తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. పలు చోట్ల ట్రైన్లు, విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.

ట్యాగ్స్​