తెలంగాణ కాంగ్రెస్ లో లుకలుకల్ని సర్దిచెప్పడానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఆదిలోనే ఝలక్ తగిలింది. ఆయన ముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు కాలు దువ్వారు. గాంధీ భవన్ లో జరిగిన ఈ మీటింగ్ లో మాజీ ఎమ్కమెల్యే ఈరవర్తి అనిల్ పై ఓయూ నేతలు దాడికి ప్రయత్నించారు. దీంతో మల్లు రవి జోక్యం చేసుకుని నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఓయూ నేతలు ‘సేవ్ కాంగ్రెస్’, ‘సీనియర్ కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.