వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల సర్వీస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఉదయ్పూర్ వేదికగా జరిగిన చింతన్ శివిర్లో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 50 ఏళ్ళు దాటిన కాంగ్రెస్ సీనియర్లకు పార్టీలో సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించింది. ఈవీఎంలను రద్దు చేసి తిరిగి బ్యాలెట్లను ప్రవేశపెట్టడానికి సిడబ్ల్యుసీ ఆమోదం తెలిపింది. ఒక కుటుంబానికి ఒకే టికెట్ పైనా ఏకాభిప్రాయం కుదిరింది.