ప్రజలతో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధం కట్ అయిపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఉదయ్పూర్ వేదికగా నిన్నటితో ముగిసిన నవ్ సంకల్ప్ శివిర్లో మాట్లాడిన ఆయన ఈ కఠిన వాస్తవాన్ని మన పార్టీ జీర్ణించుకోవాల్సిందేనన్నారు. దీన్ని అంగీకరించి సంబంధాల్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాల్సిందేనని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజల మధ్యకు ధైర్యంగా వెళ్ళి, వారి సమస్యలను తెలుసుకోవాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు.