అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో ఎల్ఐసి ఐపిఓను తీసుకురావడంపై కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆ సంస్థ విలువను రూ.12–14 లక్షల కోట్లుగా అంచనా వేసిన కేంద్రం రేపు ఐపివోను తెస్తున్న సమయంలో కంపెనీ విలువను రూ.6 లక్షల కోట్లుగా పేర్కొనడం ఏమిటని ప్రశ్నించింది. కంపెనీ విలువలో రూ.6 లక్షల కోట్లు ఏమయ్యాయయని అడిగింది. ఇదిలా ఉండగా ఎల్ఐసి రూ.21 వేల కోట్ల సమీకరణకు రేపు ఐపిఓ లిస్టింగ్ చేయనుంది.