తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్పై ప్రజలు కుర్చీలు, చెప్పులు, రాళ్ళతో దాడికి దిగారు. ఆదివారం రాత్రి ఘట్కేసర్లో జరిగిన రెడ్డి జాగృతి కమ్యూనిటీ సదస్సుకు హాజరైన ఆయన ప్రభుత్వం రెడ్డి కులానికి ప్రవేశపెట్టిన పథకాలపై వివరిస్తుండగా ప్రజలు తిరగబడ్డారు. దీంతో పలుమార్లు ఆయన ప్రసంగానికి బ్రేకులు పడడంతో ఆయన స్టేజ్ దిగి కారు ఎక్కుతుండగా దాడికి దిగారు. అనంతరం ఆయన కాన్వాయ్ను వెంటాడుతూ కుర్చీలు, రాళ్ళు, చెప్పులతో దాడికి దిగారు.