వంటగ్యాస్ ధరను చమురు కంపెనీలు సిలిండర్పై రూ.50 వరకూ పెంచేశాయి. రెండు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈనెల 1వ తేదీన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.102.50 పెంచిన చమురు కంపెనీలు వారం గడవక ముందే ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచేశాయి. దీంతో ప్రస్తుతం 14.2 కేజీల కుకింగ్ గ్యాస్ ధర రూ.999.50 కు (ఢిల్లీలో) చేరింది. ఎపిలో ప్రస్తుతం దీని ధర రూ.1.066.50కు, తెలంగాణలో రూ.1,076.50 కు చేరింది.