చెన్నై పోలీస్ స్టేషన్లో జరిగిన విఘ్నేష్ అనే నిందితుడి లాకప్ డెత్పై ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. దీంతో పలువురు సీనియర్ పోలీసుల్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు దానిని హత్య కేసుగా మార్చారు. పోస్ట్ మార్టమ్లో విఘ్నేష్ శరీరంపై 13 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది. మత్తు మందు సరఫరా చేస్తున్నాడన్న అనుమానంతో అరెస్ట్ అయిన విఘ్నేష్ మరుసటి రోజునే లాకప్ డెత్ అయ్యాడు.