దేశంలో ఉప్పు ఉత్పత్తిలో భారీ లోటు కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉప్పును ఉత్పత్తి చేసే గుజరాత్లో గతేడాదితో పోల్చితే ఏకంగా 30 శాతం తక్కువగా ఉప్పు ఉత్పత్తి జరిగింది. నిజానికి ఉప్పు ఉత్పత్తి ప్రతీ ఏటా మార్చి నెల నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఏడాది సుదీర్ఘ కాలం పాటు కురిసిన వర్షాలకు ఈ సీజన్ లేట్గా మొదలైందని భారత సాల్ట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భారత్ రావల్ పేర్కొన్నారు.