రిషబ్ శెట్టి మూవీ కాంతారా ఫ్యాన్స్ కు కోర్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మూవీలో వాడిన వరాహ రూపం పాట తమదేనంటూ కోర్టుకెక్కిన కేరళ బ్యాండ్ థైక్కుడం బ్రిడ్జ్ ప్లీ ని కేరళ కోర్ట్ కొట్టేసింది. దీంతో ఈ పాట తిరిగి సినిమాలో భాగం కానుంది. నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ లో వరాహ రూపం పాట బదులు వేరే సాంగ్ ను ప్లే చేస్తుండడంతో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.