ప్రపంచాన్ని కొవిడ్ మహమ్మారి కమ్మేసిన సమయంలో ప్రతీ 30 గంటలకు ఓ కొత్త బిలయనీర్ పుట్టుకొచ్చాడని ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ సంచలన రిపోర్ట్లో వెల్లడించింది. ‘ప్రజల బాధల నుంచి డబ్బులు గుంజుకుని వీరంతా బిలయనీర్లుగా మారిపోయారు’అయని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫారమ్లో ఆక్స్ఫామ్ ప్రతినిధులు ఈ నివేదికను బయటపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా 573 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారని, అదే సమయంలో 26.3 కోట్ల మంది తీవ్ర దారిద్ర్యంలోకి జారిపోయారని తెలిపింది.