దక్షిణాఫ్రికాలో తొలిసారిగా బయటపడ్డ కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్లు బిఎ.4, బిఎ.5 లు భారత్లోకీ ప్రవేశించాయని జీనోమ్ కన్సార్టియం నిర్ధారించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ళ యువతికి మే 21న జరిపిన పరీక్షల్లో బిఎ.4 వేరియంట్ ఉందని గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణలోని 80 ఏళ్ళ వృద్ధుడికి జరిపిన పరీక్షల్లో అతడి శరీరంలో బిఎ.5 కొవిడ్ వేరియంట్ బయటపడిందని జీనోమిక్స్ కన్సార్టియం పేర్కొంది.