చెన్నైసూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్.ధోనీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే అతడు హీరోగా కాకుండా నిర్మాతగా తన తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ధోనీ నిర్మించనున్న ఈ చిత్రంలో లేడీ సూపర్స్టార్ నయనతార హీరోయిన్గా చేయనుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన ఐపిఎల్ ముగిసిన తర్వాత చేయనున్నారు. ప్రస్తుతం ధోనీ ఐపిఎల్తో బిజీగా ఉండగా.. నయన తార షారూక్, అట్లీల మూవీ షూటింగ్లో ఉంది.