మలయాళ నటి భావన అత్యాచార కేసులో కేరళ పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, నటుడు దిలీప్ కుమార్ విచారణలో భాగంగా అతడి భార్య కావ్య మాధవన్ను పోలీసులు విచారించారు. ఇటీవల ఈ కేసులో నిందితులైన దిలీప్ బంధువులు సూరజ్, శరత్ల ఆడియో క్లిప్స్ బయటకు రావడంతో ఈ కేసుతో కావ్యకు సైతం సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను సోమవారం ఈరోజు 4 గంటల పాటు విచారించారు. అయితే కావ్య.. పోలీసుల విచారణకు సరైన సమాధానాలు ఇవ్వలేదని తెలుస్తోంది.