ఐపిఎల్లో అత్యంత విజయవంతమైన రెండు జట్ల మధ్య గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై చేతిలో చెన్నై మట్టికరిచింది. ముంబై బౌలర్ ధాటికి చెన్నై బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. 39 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఆ జట్టును ధోనీ 36 పరుగులుతో ఆదుకోవడంతో 15.6 ఓవర్లకు 97 పరుగులు చేయగలిగింది. సామ్స్ 3, మెరెడిత్, కార్తికేయ రెండేసి వికెట్లు తీశారు. ఆపై ఛేదనలో ముంబై తడబ్బా తిలక్ వర్మ 34, టిమ్ డేవిడ్ 16 పరుగులతో రాణించి జట్టును గెలిపించారు.