నిన్న రాత్రి ముంబైతో మ్యాచ్లో ఘోర ఓటమి చవి చూసిన చెన్నై జట్టు ఈ ఏడాది ఐపిఎల్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది. ఇప్పటికే టెక్నికల్గా ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ బెర్త్ దాదాపు దూరం కాగా.. నిన్నటి మ్యాచ్తో అది కన్ఫర్మ్ అయింది. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు దూరమైన రెండో జట్టుగా నిలిచింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్స్కు దూరం కాగా.. ఇప్పుడు అదే జట్టును చెన్నైనూ వెనక్కి లాగింది. ఈ రెండు జట్ల వద్దే 9 ఐపిఎల్ ట్రోఫీలు ఉన్న సంగతి తెలిసిందే.