ధోనీ తిరిగి చెన్నై పగ్గాలు అందుకున్న వెంటనే ఆ జట్టులో జోష్ కనిపించింది. సూపర్ ఫామ్లో ఉన్న హైదరాబాద్ను మట్టికరిపించి ఆదివారం మ్యాచ్లో విజయాన్ని ఎగురేసుకుపోయింది. ముందు బ్యాటింగ్ చేసిన చెన్నైలో గైక్వాడ్ 99, కాన్వే 85 రాణించడంతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆపై ఛేదనకు దిగిన సన్రైజర్స్ చివరి వరకూ పోరాడి చేతులెత్తేసింది. విలియమ్సన్ 47, పూరన్ 64, అభిషేక్ 39 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. చెన్నై బౌలర్ చౌదరి 4 వికెట్లు తీశాడు.