చెన్నై జట్టు యాజమాన్యంతో ఆ జట్టు స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ జడేజాకు పొసగడం లేదని టాక్ వినిపిస్తోంది. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకుని మధ్యలోనే కెప్టెన్సీని వదిలేసిన జడేజాపై జట్టు యాజమాన్యం గుర్రుగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగుల్లో ఫామ్లో లేకపోవడంతో అతడిని ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో కనీసం ఎంపిక కూడా చేయలేదు. ఇందులోనూ యాజమాన్యం హస్తం ఉందని ప్రచారం ఉంది. దీంతో అతడు వచ్చే సీజన్లో ఆ జట్టును వీడాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.