జోధ్​పూర్​ అల్లర్లలో 97 మంది అరెస్ట్​

By udayam on May 4th / 12:40 pm IST

ఈద్​ సందర్భంగా రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటి వరకూ 97 మందిని అరెస్ట్​ చేసినట్లు పోలీసులుతెలిపారు. గత సోమవారం నాడు రంజాన్​, పరశురామ జయంతి పర్వదినాల సందర్భంగా రెండు మతాలకు చెందిన వర్గాలు వేరే మతాల జెండాలను తొలగించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో పోలీసులు ఇంటర్నెట్​ను బంద్​ చేసి కర్ఫ్యూ అమలు చేశారు. సిఎం అశోక్​ గెహ్లాట్​సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి పరిస్థితులను దగ్గరుండి సమీక్షించారు.

ట్యాగ్స్​