అసాని తుఫాను ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద తీరం దాటింది. దీంతో కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ బీచ్ రోడ్డు దారుణంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణాలను నిలిపివేశారు. ఈ సాయంత్రానికి ఇది నర్సాపూర్, యానాం, తుని, విశాఖపట్నం తీరాలకు చేరి అనంతరం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు రాత్రికి పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకుంటుందని తెలిపింది.