రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అర్హులైన దళితులకు దళిత బంధును అమలు చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. బ్యాంకు ఖాతాకు ఆధార్, పాన్లు లింక్ అయ్యాయా లేదా అన్నది పట్టించుకోకుండా రూ.10 లక్షల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు తాజా ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేల సలహాలతో లబ్దిదారులను ఎంపిక చేయాలని, ప్రతీ నియోజకవర్గానికి ముందుగా 100 మంది చొప్పున ఫైనల్ చేయాలని కేసీఆర్ ఆదేశించారు.