భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ రూ.1.63 కోట్లు మోసపోయాడు. హర్యానా క్రికెటర్గా మృనాంక్ సింగ్ తన వద్ద నుంచి ఈ మొత్తాన్ని కాజేశాడని ఢిల్లీ పోలీసులకు పంత్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం మృనాంక్ మరో వ్యాపారవేత్తను మోసం చేసిన కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నాడు. లగ్జరీ వాచ్లు, బాగ్స్, జ్యుయెలరీ, మొబైల్ ఫోన్స్ను కొని తిరిగి అమ్మకాలు జరిపే బిజినెస్ ప్రారంభించడానికి ఈ మొత్తాన్ని తన వద్ద నుంచి తీసుకున్నట్లు పంత్ పేర్కొన్నాడు.