ఇరు జట్లూ తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ పై పంజాబ్ చేతులెత్తేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పటిష్ఠ ఢిల్లీని 159 పరుగులకే పంజాబ్ బౌలర్లు నిలువరించినా.. కింగ్స్ బ్యాటర్లు మాత్రం లక్ష్యాన్ని ఛేధించడంలో తడబడ్డారు. ఢిల్లీ బౌలర్లు శార్దూల్ ఠాకూర్ 4, అక్షర్ పటేల్ 2, కుల్దీప్ 2, నోర్కియా 1 వికెట్ల దెబ్బకు 20 ఓవర్లలో 142 పరుగులే చేయగలిగింది. ఢిల్లీలో మిచెల్ మార్ష్ 63 పరుగులు చేయగా.. సర్ఫరాజ్ 32, లలిత్ యాదవ్ 24 చేశారు.