దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెలికాలర్ శ్రద్దా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాల ఈరోజు కోర్టులో తన వాంగ్మూలాన్ని వెల్లించాడు. ఆవేశంలోనే తాను శ్రద్దాను హత్య చేసినట్లు అంగీకరించిన అతడు.. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవ్వడంతో అప్పుడు సరిగ్గా ఏం జరిగిందీ అన్నది తనకు గుర్తు లేదంటున్నాడు. పోలీసుల కస్టడీ గడువు ముగియడంతో అతడిని సాకేత్ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని, కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యం లేదని న్యాయమూర్తి ముందు వెల్లడించాడు.