కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోని 27 హిందు, జైన దేవాలయాలను పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మంగళవారం విచారించిన దిల్లీ సాకేత్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మెహ్రూలీలోని కవ్వత్ ఉల్ ఇస్లాం మసీదును, హిందూ దేవాలయాల ప్రాంగణంలో నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. అప్పీలుదారు, ఇతర పక్షలు చేసిన సుదీర్ఘ వాదనలు విన్న జస్టిస్ నిఖిల్ చోప్రా తీర్పును జూన్ 9 వరకూ రిజర్వ్ చేశారు.