ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ అనిల్ బైజల్ తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. కేజ్రీవాల్ ప్రభుత్వంతో ఉప్పూ నిప్పుగా ఉండే ఆయన.. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతికి రామ్నాథ్ కోవింద్కు రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. 2016 నుంచి ఢిల్లీకి లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఉన్న ఆయన.. 2018లో సుప్రీంకోర్టు ‘మీ హద్దుల్లో మీరుండండి’ అని చెప్పే వరకూ ఢిల్లీలో ఆయన కేజ్రీవాల్ కంటే పవర్ఫుల్గా ఉండేవారు.