ఢిల్లీలో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ళ చిన్నారిపై జరిగిన యాసిడ్ దాడిలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సచిన్ అరోరా (20) ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మాయిని వేధిస్తుండగా.. అతడితో పాటు బైక్ పో హర్షిత్ అగర్వాల్ కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మరో వ్యక్తి వీరేందర్ సింగ్ సచిన్ ఫోన్ ను వేరే లొకేషన్లో ఉన్నట్లు చూపించడానికి బైక్ పై ప్రయాణిస్తూ ఉండేవాడని పోలీసులు తెలిపారు. అయితే వీరు ఈ దాడికి వాడిన యాసిడ్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి కొన్నట్టు పోలీసులు తెలిపారు. సుప్రీం నిషేధ ఆదేశాలు ఉన్నప్పటికీ యాసిడ్ అమ్మకాలు జరుపుతున్న ఫ్లిప్ కార్ట్, అమెజాన్ సంస్థలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.