దేశంలో ఇప్పటికే మండిపోతున్న పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసరాలు, వంటనూనెలకు తోడు ఇప్పుడు చపాతీ పిండి కూడా ఆకాశానికెక్కి కూర్చుంది. గత 30 రోజుల్లో గోధుమ పిండి సగటు రిటైల్ ధర రూ.32లకు పైగా పెరిగి కేజీ రూ.59కి చేరింది. 2010 తర్వాత ఈ స్థాయిలో దీని రేటు పెరగడం ఇదే తొలిసారి. దేశంలో గోధుమల ఉత్పత్తి, నిల్వలు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో గోధుమ పిండికి డిమాండ్ పెరుగుతోందని తెలిపారు.