మొన్న రుయా.. నిన్న నెల్లూరు.. నేడు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి.. మూడు చోట్లా ఒకటే ఫిర్యాదు.. ఆపదలో ఆదుకోవాల్సిన అంబులెన్సులను వాటి డ్రైవర్లు మృతదేహాలను తరలించడానికి రాకపోవడంతో తల్లిదండ్రులకు తీవ్ర మనోవేదనను మిగుల్చుతున్నాయి. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించిన 2 ఏళ్ళ చిన్నారిని ఇంటికి తీసుకెళ్ళడానికి రూల్స్ ఒప్పుకోవమని అంబులెన్సు ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో చేసేది లేక తల్లిదండ్రులు ఆ పాపను బైక్పైనే సొంత ఊరుకు తీసుకెళ్ళారు.