18వ శతాబ్దపు వ్యక్తి పిళ్ళైకు క్రైస్తవంలో అత్యంత అరుదైన గుర్తింపు దక్కింది. ఇకపై పిళ్ళైను దేవదూతగా గుర్తించనున్నట్లు క్రైస్తవుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ప్రకటించారు. 1712 ఏప్రిల్ 23న పుట్టిన నీలకంఠ పిళ్ళై ఆ రోజుల్లో మతమార్పిడి చేసుకుని క్రైస్తవునిగా మారారు. ఆపై ఉన్నత కులాల కోపానికి గురైన ఆయనకు 1752 జనవరి 14న మరణ శిక్ష విధించారు. కేథలిక్ బిషప్స్ ఆఫ్ ఇండియా కోరిక మేరకు బీటిఫికేషన్ వేడుకలో దేవసహాయంకు ఈ గుర్తింపు దక్కింది.