కళాకారుల ప్రదర్శనకు మంత్రముగ్ధులైన అభిమానులు వారిపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించిన ఘటన గుజరాత్ లోని సుపా గ్రామంలో జరిగింది. నేత్ర సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి కోసం విరాళాల సేకరణ కోసం స్వామి వివేకానంద నేత్ర మందిర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన భజన కార్యక్రమంలో గాయకుడు కీర్తి దాస్ గధ్వి పై నోట్ల వర్షం కురిపించారు. ఇలా మొత్తంగా దాదాపు రూ. 50 లక్షలు సమకూరినట్టు ట్రస్ట్ పేర్కొంది. కాగా, సంగీత కచేరిలో అభిమానులు డబ్బులు వెదజల్లుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'હે કમા, પિક્ચરમાં જવું છે?', ડાયરામાં કીર્તિદાન ગઢવીએ પૂછેલા સવાલનો કમાએ શું જવાબ આપ્યો?,વાયરલ વિડિયો#KirtidanGadhvi #Kamo #Navsari pic.twitter.com/KpRV6uKcJ0
— Kaltak24 News (@KalTak24News) December 29, 2022