తమిళ అగ్ర నటుడు ధనుష్ తమ కొడుకేనంటూ కతిరేసన్, మీనాక్షి దంపతులు వేసిన కేసులో మద్రాస్ హైకోర్ట్ నటుడికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసును 2017లో మథురై హైకోర్ట్ పేటర్నిటీ టెస్ట్ ఫలితాలను పరిశీలించి కొట్టేసింది. ఆ సమయంలో ధనుష్ తన పెటర్నిటీ టెస్ట్కు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేశాడని కతిరేసన్ దంపతులు తాజాగా మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణకు రావాలని ధనుష్కు మద్రాస్ నోటీసులు జారీ చేసింది.