ఈరోజే విడుదలైన బాలకృష్ణ వీర సింహారెడ్డి మూవీ అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం ను కన్ ఫర్మ్ చేసుకుంది. ఈ మూవీ కి భారీ ధర చెల్లించి స్ట్రీమింగ్ రైట్స్ ను డిస్నీ + హాట్ స్టార్ సంస్థ దక్కించుకుంది. అయితే 30 రోజుల తర్వాతే ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మూవీలో బాలకృష్ణ తో పాటు శృతి హాసన్ కీలక పాత్రల్లో నటించారు.