మహారాష్ట్రలోని షోలాపుర్ జిల్లాలో పెళ్లి కాని యువకులు వింత నిరసన చేపట్టారు. వివాహాలు చేసుకోటానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు పెళ్లి కాని యువకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గుర్రాలపై ఊరేగింపుగా వచ్చి శోలాపుర్ కలెక్టరేటు ఎదుట బైఠాయించారు. మహారాష్ట్రలో లింగ నిష్పత్తి సమానంగా లేకపోవడానికి లింగ నిర్ధరణ చట్టం పటిష్ఠంగా అమలు కాకపోవటమే కారణమని వీరు ఆరోపించారు.
मुली मिळत नाही म्हणून हतबल झालेल्या भावी 'नवरदेवां'चा लग्नासाठी मोर्चा#groom #wedding #Solapurhttps://t.co/wXS1SymnaS pic.twitter.com/YySgltw2T8
— Divya Marathi (@MarathiDivya) December 21, 2022