దేశంలోనే దిగ్గజ ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్కు నాలుగో త్రైమాసిక లాభాల్లో 76 శాతం కోత పడింది. ఈ త్రైమాసికంలో కేవలం 88 కోట్ల రూపాయల లాభాన్ని మాత్రమే ఆర్జించింది. ఇంపైర్మెంట్ ఛార్జెస్ రూపంలో రూ.751.5 కోట్లను చెల్లించాల్సి రావడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతేడాది పోల్చితే కంపెనీ ఆదాయం 15 శాతం పెరిగి రూ.5,437 కోట్లకు చేరిందని కంపెనీ పేర్కొంది. దీంతో కంపెనీ ఒక్కో షేరుపై రూ.30 డివిడెండ్ను ప్రకటించింది.