జూన్ 1, 2 తేదీల్లో హైదరాబాద్ వాసులకు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సింగూర్ ఫేజ్–3 పైప్లైన్ లీకేజీలకు మరమ్మత్తుల కారణంగా 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్ అవుతుందని జల మండలి సోమవారం ప్రకటించింది. బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 వరకూ మంచినీటి సరఫరా నిలిచిపోతుందని పేర్కొంది. శంకర్ పల్లి వద్ద మూడు చోట్ల మరమ్మత్తులు జరుగుతుండడమే ఇందుకు కారణమని పేర్కొంది.