నేషనల్ హెరాల్డ్ కేస్లో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి ఈడీ ఇచ్చిన సమన్లలో కాస్త మార్పులు చేసింది. జూన్ 13 లోపు ఆయన తమ ముందు విచారణకు రావాల్సి ఉంటుందని తాజాగా మార్పులు చేసింది. అంతకు ముందు ఇదే కేసులో సోనియా, రాహుల్ గాంధీలు ఈనెల 8న తమ ముందు విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేయగా.. ఇప్పుడు ఆ తేదీని 13కు మార్పు చేసింది. సోనియా గాంధీ కొవిడ్ 19 బారిన పడడంతో ఈడీ తన విచారణను వాయిదా వేసుకుంది.