మహారాష్ట్ర మంత్రిపై ఈడీ రైడ్​

By udayam on May 26th / 10:05 am IST

మహారాష్ట్ర చెందిన రవాణా శాఖ మంత్రి అనిల్​ పరబ్​ నివాసంలో ఈరోజు ఈడీ తనిఖీలు చేపట్టింది. మనీలాండరింగ్​ కేసుకు సంబంధించి ఈ తనఖీలు జరిపినట్లు ఈడీ వెల్లడించింది. 2017లో ఆయన దాపోలీ వద్ద కొన్న ఓ భూమిని 2019లో రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు. అయితే 2020లో అదే భూమిని 1.10 కోట్లకు ఆయన వేరే వ్యక్తికి అమ్మేశారు. ఈ క్రమంలో అక్కడ కట్టిన రిసార్ట్​కు రూ.6 కోట్ల బ్లాక్​ మనీని వినియోగించినట్లు ఈడీ పేర్కొంది.

ట్యాగ్స్​