చైనా వర్కర్లకు లంచం తీసుకుని వీసాలు ఇప్పించారన్న కేసులో సపిబిఐ విచారణ ఎదుర్కొంటున్న కార్తి చిదంబరంపై ఈడీ సైతం కేసు నమోదు చేసింది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపింది. ఈ కేసు విషయమై బుధవారం ఉదయం కార్తి ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి రావాల్సి ఉండగా.. అతడి స్థానంలో లాయర్ సిబిఐ ఆఫీసుకు వెళ్ళాడు. దీంతో విచారించాల్సింది కార్తీని కానీ మిమ్మల్ని కాదంటూ వారు కార్తి లాయర్ను తిప్పి పంపారు.