కొవిడ్ సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని గుర్తించిన అధికారులు ఎపిలోని గుంటూరు, విజయవాడలోని పలు ఆస్పత్రులు, పలువురి ఇళ్లపై శుక్రవారం ఈడీ, ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. గుంటూరులోని మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బఅందాలుగా సోదాలు నిర్వహించారు. నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన అధికారులు, ఎన్ఆర్ఐ ఆస్పత్రి పాత మేనేజ్మెంట్ డైరెక్టర్ ఇళ్లలోనూ సోదాలు చేశారు. విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆస్పత్రిలో ఈడీ తనిఖీలు చేపట్టారు.