బెంగళూరు డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి లకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. వచ్చే సోమవారం తమ ముందు విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల్లో పేర్కొంది. బెంగళూరులోని ఓ పార్టీలో నమోదైన డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటికి వచ్చాయి. ఈ క్రమంలోనే అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.