జమ్మూ కశ్మీర్ మాజీ సిఎం ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో విచారణకు గానూ ఈనెల 31న తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన ఆర్ధిక అవకతవకలపై విచారణకు గానూ ఈ సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసుకు సంబంధించి 2020 ఏడాదిలో ఫరూఖ్ కు చెందిన 11.86 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. 84 ఏళ్ళ ఈ వృద్ధ రాజకీయ నాయకుడిని ఇదే కేసులో ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారించింది.